జన గణన కోసం కేంద్ర హోంశాఖ 2025, జూన్ 16న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పేరుతో ఇది విడుదలైంది. జన గణన చట్టం-1948లోని సెక్షన్ 3 కింద ఉన్న అధికారాలను అనుసరించి 2019 మార్చి 28న జారీ చేసిన 2021 నాటి జన గణన గెజిట్ నోటిఫికేషన్ను కేంద్రం రద్దు చేసింది. ఆ స్థానంలో ఇప్పుడు 2027 నోటిఫికేషన్ను జారీ చేసింది. 2027 మార్చి 1 నాటికి దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది.