Published on Jun 17, 2025
Current Affairs
జన గణన గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
జన గణన గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

జన గణన కోసం కేంద్ర హోంశాఖ 2025, జూన్‌ 16న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. భారత రిజిస్ట్రార్‌ జనరల్, సెన్సస్‌ కమిషనర్‌ మృత్యుంజయ్‌ కుమార్‌ నారాయణ్‌ పేరుతో ఇది విడుదలైంది. జన గణన చట్టం-1948లోని సెక్షన్‌ 3 కింద ఉన్న అధికారాలను అనుసరించి 2019 మార్చి 28న జారీ చేసిన 2021 నాటి జన గణన గెజిట్‌ నోటిఫికేషన్‌ను కేంద్రం రద్దు చేసింది. ఆ స్థానంలో ఇప్పుడు 2027 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 2027 మార్చి 1 నాటికి దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది.