ఆంగ్ల విభాగంలో దేశంలోనే తొలి డాక్టరేట్ పొందిన ట్రాన్స్జెండర్గా తమిళనాడుకు చెందిన జెన్సీ వార్తల్లో నిలిచారు. తిరుత్తణిలోని ఆర్కేపేట పుదూర్కు చెందిన జెన్సీ.. సొంత గ్రామంలో పాఠశాల విద్య పూర్తిచేశారు. అనంతరం తిరుత్తణిలోని సుబ్రమణ్యస్వామి ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో యూజీ చదివి, చెన్నై వ్యాసర్పాడిలోని అంబేడ్కర్ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ, ఎంఫిల్లో గోల్డ్మెడల్ సాధించారు. అనంతరం చెన్నై లయోలా కళాశాలలో ఆంగ్ల విభాగంలో డాక్టరేట్ అందుకుని, అదే కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు.