గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను తగ్గించడంతో పాటు మాతాశిశు మరణాల నివారణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమశాఖ ఏఐ సాయంతో ‘జననీ మిత్ర యాప్’ను 2025, ఫిబ్రవరి 14న అందుబాటులోకి తెచ్చింది.
ఈ యాప్ను రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లా కూడేరు పీహెచ్సీ పరిధిలో స్వస్తి అనే సంస్థతో కలిసి ప్రారంభించారు.
గర్భిణులు, బాలింతలు యాప్ను వినియోగించడం వల్ల రోజూ వారు తినే ఆహారంతోపాటు ఆరోగ్య సంబంధ విషయాలను పరిశీలించుకోవచ్చు.