Published on Feb 15, 2025
Current Affairs
జననీమిత్ర యాప్‌
జననీమిత్ర యాప్‌

గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను తగ్గించడంతో పాటు మాతాశిశు మరణాల నివారణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమశాఖ ఏఐ సాయంతో ‘జననీ మిత్ర యాప్‌’ను 2025, ఫిబ్రవరి 14న అందుబాటులోకి తెచ్చింది.

ఈ యాప్‌ను రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లా కూడేరు పీహెచ్‌సీ పరిధిలో స్వస్తి అనే సంస్థతో కలిసి ప్రారంభించారు.

గర్భిణులు, బాలింతలు యాప్‌ను వినియోగించడం వల్ల రోజూ వారు తినే ఆహారంతోపాటు ఆరోగ్య సంబంధ విషయాలను పరిశీలించుకోవచ్చు.