Published on Aug 21, 2025
Current Affairs
‘జాతీయ మహిళా కమిషన్‌’ సభ్యుల నియామకం
‘జాతీయ మహిళా కమిషన్‌’ సభ్యుల నియామకం

జాతీయ మహిళా కమిషన్‌ సలహా కమిటీ-2025 సభ్యులుగా ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, తెలంగాణ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ మహేశ్‌ భగవత్‌లు నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ మహిళా సంఘం 2025, ఆగస్టు 20న ప్రకటన విడుదల చేసింది. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ విజయా కిశోర్‌ రహాట్కర్‌ ఆధ్వర్యంలో నడిచే ఈ కమిటీలో మొత్తం 21 మందిని సభ్యులుగా నియమించారు.