- ములుగు జిల్లా పాలంపేట్లో ఉన్న గొల్లలగుడిని జాతీయ ప్రాధాన్యం ఉన్న పురావస్తు కేంద్రంగా గుర్తించాలని నిర్ణయించినట్లు కేంద్ర సాంస్కృతికశాఖ తెలిపింది.
- పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు అవశేషాల చట్టం-1958లోని సెక్షన్4(1)కింద ఉన్న అధికారాలను అనుసరించి ఈ గుడిని జాతీయ ప్రాధాన్యమున్న పురాతన స్మారకంగా ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మేరకు 2026, మార్చి 6న జారీచేసిన ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొంది.