Published on Aug 29, 2025
Current Affairs
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలోని లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్‌ మెండా దేవానంద్‌కుమార్‌ ఎంపికయ్యారు.

2025, ఆగస్టు 26న కేంద్రం ఈ ప్రకటన చేసింది.

గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబరు 5న దిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులమీదుగా ఆయన అవార్డు అందుకోనున్నారు.

2021 నుంచి మైలవరం కళాశాలలో పనిచేస్తున్న ఆయన వినూత్న కార్యక్రమాలకు పేరొందారు.  

2024లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు.