Published on Apr 2, 2025
Current Affairs
జీఎస్‌టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లు
జీఎస్‌టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లు

2025, మార్చిలో జీఎస్‌టీ స్థూల వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లకు చేరాయి. 2024 మార్చి వసూళ్లయిన రూ.1.78 లక్షల కోట్లతో పోలిస్తే, ఇవి 9.9% అధికం. 

జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చాక ఒక నెలకు సంబంధించి రెండో అత్యధిక వసూళ్లు ఈ మార్చిలోనే నమోదయ్యాయి.

2024, ఏప్రిల్‌లో వసూలైన రూ.2.10 లక్షల కోట్లు ఇప్పటివరకు అత్యధిక వసూళ్లుగా ఉన్నాయి. 2024-25 మొత్తంమీద రూ.22.08 లక్షల కోట్లు వసూలయ్యాయి.