Published on Oct 2, 2024
Current Affairs
జీఎస్‌టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లు
జీఎస్‌టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లు

2024 సెప్టెంబరులో జీఎస్‌టీ వసూళ్లు అంతకుముందు నెల కంటే 6.5% తగ్గి రూ.1.73 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. ఆగస్టులో ఇవి రూ.1.75 లక్షల కోట్లుగా ఉన్నాయి. అయితే 2023 సెప్టెంబరులో నమోదైన రూ.1.63 లక్షల కోట్లతో పోలిస్తే 2024 సెప్టెంబరులో జీఎస్‌టీ వసూళ్లు ఎక్కువే. గత నెలలో రిఫండ్‌లు రూ.20,458 కోట్లుగా ఉన్నాయి. ఏడాదిక్రితంతో పోలిస్తే ఇవి 31% అధికమయ్యాయి. రిఫండ్‌ల సర్దుబాటు అనంతరం సెప్టెంబరులో నికరంగా జీఎస్‌టీ ఆదాయం 3.9% అధికమై రూ.1.53 లక్షల కోట్లుగా ఉంది.