Published on Nov 8, 2025
Current Affairs
జీఈతో హెచ్‌ఏఎల్‌ ఒప్పందం
జీఈతో హెచ్‌ఏఎల్‌ ఒప్పందం

దేశీయంగా రూపొందించిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్‌’ కోసం 113 జెట్‌ ఇంజిన్ల కొనుగోలుకు అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్‌తో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) 2025, నవంబరు 7న కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ.8,870 కోట్లు. దీనికింద ఎఫ్‌404-జీఈ-ఐఎన్‌20 శ్రేణి ఇంజిన్లను భారత్‌కు జీఈ అందిస్తుంది. 2027 నుంచి వీటి సరఫరా మొదలై 2032 కల్లా పూర్తవుతుంది.