ఒక్కసారే దాదాపు 10 అణ్వాయుధ వార్హెడ్లను మోసుకెళ్లే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం)ని 2024, సెప్టెంబరు 25న చైనా విజయవంతంగా పరీక్షించింది. హైనన్ ద్వీపం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి సుమారు 12 వేల కిలోమీటర్లు ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలోని అంతర్జాతీయ జలాల్లోకి పడింది.
ప్రస్తుత క్షిపణి అమెరికాలోని ప్రధాన నగరాలను సునాయాసంగా ఢీకొట్టగలదు.