Published on Jun 7, 2025
Current Affairs
చినాబ్, అంజీ వంతెనల ప్రారంభం
చినాబ్, అంజీ వంతెనల ప్రారంభం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చినాబ్‌ రైల్వే వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025, జూన్‌ 6న ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.

కట్రా నుంచి కశ్మీర్‌కు వందేభారత్‌ రైలుకు జెండా ఊపడం ద్వారా మొదలు పెట్టారు.

అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెన (కేబుల్‌ బ్రిడ్జి)ను ప్రారంభించారు. 

అత్యంత దుర్లభమైన శివాలిక్, పీర్‌ పంజాల్‌ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీర్‌ లోయకు రైలు నడపడం ఒక శతాబ్దం కిందటి ప్రతిష్ఠాత్మక ప్రణాళిక.

బ్రిటిష్‌ కాలంలోనే ఈ కొండల సర్వేకు ఇంజినీర్లను నియమించినా ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.