Published on Nov 15, 2024
Current Affairs
చంద్రశేఖర్‌ ఆజాద్‌కు బాలసాహిత్య పురస్కారం ప్రదానం
చంద్రశేఖర్‌ ఆజాద్‌కు బాలసాహిత్య పురస్కారం ప్రదానం

కేంద్ర సాహిత్య అకాడమీ 2024 సంవత్సరానికి ప్రకటించిన బాలసాహిత్య పురస్కారాన్ని తెలుగు రచయిత పమిడిముక్కల చంద్రశేఖర్‌ ఆజాద్‌ అందుకున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో 2024, నవంబరు 14న నిర్వహించిన కార్యక్రమంలో అకాడమీఛైర్మన్‌ మాధవ్‌కౌశిక్‌ ఆయనకు ఈ అవార్డుతోపాటు రూ.50వేల నగదు బహుమతి, తామ్రపత్రం అందించి.. శాలువాతో సత్కరించారు. 

చిన్నారుల జీవితాలపై ఆయన రాసిన మాయాలోకం నవలకు అకాడమీ ఈ పురస్కారాన్ని ప్రకటించింది.

చంద్రశేఖర్‌ ఆజాద్‌ స్వస్థలం గుంటూరు జిల్లా. ఇప్పటివరకు 30 నవలలు, వందకు పైగా లఘుకథలు రాశారు. గతంలో నంది అవార్డు, కళారత్నహంస పురస్కారాలు పొందారు.