Published on May 12, 2025
Current Affairs
చంద్రశేఖర్‌రెడ్డి ప్రమాణస్వీకారం
చంద్రశేఖర్‌రెడ్డి ప్రమాణస్వీకారం

సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) రాష్ట్ర ప్రధాన కమిషనర్‌గా డా.జి.చంద్రశేఖర్‌రెడ్డి 2025, మే 9న పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనతో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయసు వరకు కొనసాగుతారు.