టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్కు ప్రతిష్ఠాత్మక హానరరీ నైట్హుడ్ పురస్కారాన్ని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.
భారత్- బ్రిటన్ మధ్య వ్యాపార సంబంధాల విషయంలో అందిస్తున్న సేవలకు గాను దీన్ని అందిస్తున్నట్లు పేర్కొంది.
కింగ్ ఛార్లెస్ నుంచి ‘ది మోస్ట్ ఎక్స్లెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ - హానరరీ డీబీఈ/ కేబీఈ’ పురస్కారాన్ని చంద్రశేఖరన్ అందుకుంటారని తెలిపింది.
సాంకేతికత, వినియోగం, ఆతిథ్యం, ఉక్కు, రసాయనాలు, వాహన రంగాల్లో బ్రిటన్తో బలమైన వ్యూహాత్మక సంబంధాలను టాటా సన్స్ కొనసాగిస్తుంది. బ్రిటన్లో 70,000 మందికి టాటా గ్రూపు ఉపాధి కల్పిస్తోంది.