ఆంధ్రప్రదేశ్లోని మదర్సాల్లో విద్యా వాలంటీర్ల నియామక పథకానికి ‘చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం’గా నామకరణం చేశారు. ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో ఉర్దూ భాషా ఉపాధ్యాయులను, వాలంటీర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు దీని తీసుకొచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,600 ఉర్దూ మాధ్యమ పాఠశాలలు ఉండగా, 238 పాఠశాలల్లో ప్రతి తరగతిలోనూ 15 మంది కంటే ఎక్కువ పిల్లలున్నారు.