హిందూ మహా సముద్రంలోని చాగోస్ ద్వీప సముదాయంపై సార్వభౌమాధికారాన్ని మారిషస్కు బ్రిటన్ అప్పగించింది. ఆ సముదాయంలోని డిగో గార్సియా దీవిని మాత్రం వచ్చే 99 ఏళ్లపాటు బ్రిటన్, అమెరికాల అధీనంలోనే కొనసాగించనుంది. ఈ మేరకు చరిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లు బ్రిటన్ 2024, అక్టోబరు 3న ప్రకటించింది.
* డిగో గార్సియా దీవిలో బ్రిటన్, అమెరికాల సైనిక స్థావరం ఉంది.