2025-26 సీజనులో జనవరి 15 వరకు భారత్లో చక్కెర ఉత్పత్తి 22 శాతం పెరిగి 15.9 మిలియన్ టన్నులకు చేరింది. చెరకు సరఫరా పెరగడం, అధిక దిగుబడి ఇందుకు దోహదం చేశాయని ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మ్యాన్ఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) తెలిపింది. జనవరి 15 వరకు దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చక్కెర మిల్లుల సంఖ్య 518 కాగా.. గత సీజనులో ఇదే సమయానికి ఈ సంఖ్య 500గా ఉందని పేర్కొంది.