రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గోవాషిప్యార్డ్ లిమిటెడ్ (జీఎస్ఎల్) ఒప్పంద ప్రాతిపదికన గ్రాడ్యుయేట్, టెక్నికల్ అప్రెంటిస్షిప్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 30.
వివరాలు:
గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్(బీఈ/ బీటెక్): 15
టెక్నికల్ అప్రెంటిసెస్ (డిప్లొమా): 05
గ్రాడ్యుయేట్(జనరల్ స్ట్రీమ్): 10
అర్హత: ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ/ బీటెక్, బీఏ, బీఎస్సీ, బీకాం డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. (2023, 2024, 2025 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణత కలిగిన వారు మాత్రమే అర్హలు).
స్టెపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ అప్రెంటిస్కు రూ.9,000; టెక్నీషియన్స్కు రూ.8,000; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు మొదటి ఏడాది రూ.9,000, రెండో ఏడాది రూ.9,900.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ ప్రాక్టికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 25-06-2025.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ (హెచ్ఆర్ & ఏ), గోవా షిప్యార్డ్ లిమిటెడ్, వాస్కో-డ-గామా, గోవా చిరునామాకు పంపించాలి.
Website:https://goashipyard.in/