ప్రధాని నరేంద్ర మోదీ 2024, నవంబరు 20న గయానా దేశాధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య 10 రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి.
హైడ్రో కార్బన్స్, డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలు, రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఫార్మా, వ్యవసాయం వంటి రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించాయి.