Published on Sep 23, 2024
Current Affairs
గోండి లిపి సృష్టికర్త జంగు మృతి
గోండి లిపి సృష్టికర్త జంగు మృతి

గోండి లిపి ఆవిష్కర్త, గోండి గుణింతాలు, గణిత సృష్టికర్త కోట్నాక్‌ జంగు (90) తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం గుంజాలలోని నివాసంలో 2024, సెప్టెంబరు 22న మరణించారు. తెలంగాణలోని ఆదివాసీ గోండు చిన్నారుల కోసం గోండి-తెలుగు వాచకాలను ఒకటి నుంచి మూడో తరగతి వరకు ప్రచురించి, వారి విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు.