గోండి లిపి ఆవిష్కర్త, గోండి గుణింతాలు, గణిత సృష్టికర్త కోట్నాక్ జంగు (90) తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుంజాలలోని నివాసంలో 2024, సెప్టెంబరు 22న మరణించారు. తెలంగాణలోని ఆదివాసీ గోండు చిన్నారుల కోసం గోండి-తెలుగు వాచకాలను ఒకటి నుంచి మూడో తరగతి వరకు ప్రచురించి, వారి విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు.