భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టుల్లో 9 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 2024, అక్టోబరు 18న న్యూజిలాండ్తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో 70 పరుగులు సాధించిన కోహ్లి ఈ ఘనత సాధించాడు. అతడికిది 197వ ఇన్నింగ్స్.
భారత క్రికెటర్లలో సచిన్ తెందుల్కర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,265), సునీల్ గావస్కర్ (10,122) తర్వాత ఈ గుర్తింపు సాధించిన బ్యాటర్ కోహ్లినే.