Published on Dec 2, 2025
Current Affairs
కృష్ణా బోర్డు ఛైర్మన్‌గా ఎస్‌.బిశ్వాస్‌
కృష్ణా బోర్డు ఛైర్మన్‌గా ఎస్‌.బిశ్వాస్‌

కృష్ణా బోర్డు ఛైర్మన్‌గా ఎస్‌.బిశ్వాస్‌ను నియమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ 2025, డిసెంబరు 1న ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర జల సంఘం ఛైర్మన్‌గా అనుపమ్‌ ప్రసాద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ రెండు పోస్టుల్లో ఛైర్మన్‌గా అతుల్‌ జైన్‌ విధులు నిర్వహిస్తుండగా నవంబరు 30న ఆయన పదవీ విరమణ చేశారు. దీంతో ఖాళీలను కేంద్రం భర్తీ చేసింది.