ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన 2025, ఏప్రిల్ 30న జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ) సమావేశంలో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని నిర్ణయించారు.
దేశంలో త్వరలో మొదలయ్యే జనాభా లెక్కల సేకరణతోపాటు దీన్ని కూడా చేపట్టాలని పేర్కొన్నారు.
రాజ్యాంగం ప్రకారం జనగణన పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. అయినప్పటికీ పలు రాష్ట్రాలు సర్వే రూపంలో కులగణనను చేపట్టాయి.
కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటకలతోపాటు.. ఎన్డీయే కూటమి చేతిలో ఉన్న బిహార్ కూడా కులగణన చేపట్టింది.
ఇప్పటికే జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ఐదేళ్లు ఆలస్యమైంది.
ఈ పనికి రూ.13,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
ఇతర నిర్ణయాలు:
షిల్లాంగ్-సిల్చార్ మధ్య 166 కి.మీ. మేర నాలుగు వరసల జాతీయ రహదారి ప్రాజెక్టును రూ.22,864 కోట్లతో చేపట్టేందుకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.
2025-26 సీజన్కు చెరకు కొనుగోలు ధరను 4.41% పెంచి క్వింటాలుకు రూ.355గా నిర్ణయించింది. రికవరీ రేటు 10.25% ఉంటే ఇది వర్తిస్తుంది.