కేరళ పేరును ‘కేరళం’గా మార్చే ప్రతిపాదనకు 2026, ఫిబ్రవరి 24న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి కార్యాలయం కొత్త భవనం ‘సేవాతీర్థ్’లో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి కేరళ శాసనసభ అభిప్రాయాన్ని తీసుకుంటారు. తర్వాత బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. ఆమోదానికి సాధారణ ఆధిక్యం సరిపోతుంది. రాష్ట్రపతి ఆమోదముద్రతో అధికారికంగా పేరు మారుతుంది. పేరు మార్పుపై కేంద్రాన్ని అభ్యర్థిస్తూ ఇప్పటికే కేరళ అసెంబ్లీ పలుమార్లు తీర్మానాలు చేసింది.