Published on May 23, 2025
Current Affairs
కీర్తిచక్ర
కీర్తిచక్ర

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన మేజర్‌ మల్లా రాంగోపాల్‌నాయుడికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కీర్తిచక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు.

దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో 2025, మే 22న జరిగిన గ్యాలంట్రీ అవార్డుల ప్రదానోత్సవôలో భాగంగా ఈ పురస్కారాన్ని అందించారు.

2023 అక్టోబరు 26న జమ్మూలోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులను మట్టుపెట్టడంలో చాకచక్యంగా వ్యవహరించినందుకు గానూ రాంగోపాల్‌కు ఈ పురస్కారం దక్కింది.

రాంగోపాల్‌ చూపిన ధైర్యసాహసాలను పరిగణనలోని తీసుకుని కేంద్రం 2024లో ‘కీర్తిచక్ర’ పురస్కారానికి ఎంపిక చేసింది.