Published on Jan 20, 2025
Current Affairs
కర్ణాటకదే విజయ్‌ హజారే
కర్ణాటకదే విజయ్‌ హజారే

విజయ్‌హజారే వన్డే టోర్నమెంట్లో కర్ణాటక విజేతగా నిలిచింది. మయాంక్‌ అగర్వాల్‌ సారథ్యంలోని జట్ట్టు 2025, జనవరి 18న జరిగిన ఫైనల్లో 36 పరుగుల తేడాతో విదర్భను ఓడించింది.

మొదట కర్ణాటక 6 వికెట్లకు 348 పరుగులు చేసింది. ఛేదనలో విదర్భ పోరాడినా.. 48.2 ఓవర్లలో 312 పరుగులకే ఆలౌటైంది. 

విజయ్‌హజారే ట్రోఫీ గెలవడం కర్ణాటకకు ఇది అయిదోసారి. ఆ జట్టు చివరగా 2019-20 సీజన్లో ఈ టోర్నీ విజేతగా నిలిచింది.