రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025, ఆగస్టు 19న జాతీయ క్రీడా బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇది చట్టంగా మారింది. ఇటీవల ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన బిల్లును రెండు ప్రధాన సవరణలతో పార్లమెంటు ఆమోదించింది. సమాచార హక్కు (ఆర్టీఐ) పరిధిని తగ్గించడం అందులో ముఖ్యమైనది. ప్రభుత్వ నిధులు, సహకారంపై ఆధారపడే క్రీడా సంస్థలను మాత్రమే ఆర్టీఐ పరిధిలో ఉంచారు. ఫలితంగా ఆర్టీఐ పరిధిలోకి రాకుండా బీసీసీఐకి వెసులుబాటు లభించింది.