Published on Aug 20, 2025
Current Affairs
క్రీడా బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
క్రీడా బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025, ఆగస్టు 19న జాతీయ క్రీడా బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇది చట్టంగా మారింది. ఇటీవల ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన బిల్లును రెండు ప్రధాన సవరణలతో పార్లమెంటు ఆమోదించింది. సమాచార హక్కు (ఆర్‌టీఐ) పరిధిని తగ్గించడం అందులో ముఖ్యమైనది. ప్రభుత్వ నిధులు, సహకారంపై ఆధారపడే క్రీడా సంస్థలను మాత్రమే ఆర్‌టీఐ పరిధిలో ఉంచారు. ఫలితంగా ఆర్‌టీఐ పరిధిలోకి రాకుండా బీసీసీఐకి వెసులుబాటు లభించింది.