లండన్కు చెందిన ప్రముఖ ఉన్నతవిద్యా విశ్లేషణ సంస్థ ‘క్యూఎస్’ 2024, సెప్టెంబరు 25న క్యూఎస్ గ్లోబల్ లిస్ట్ - 2025ను విడుదల చేసింది. ప్రపంచంలోని 58 దేశాలు, భూభాగాల్లో అత్యుత్తమంగా ఉన్న విద్యాసంస్థల 340 ఎంబీఏ, బిజినెస్ కోర్సుల ప్రమాణాలను విశ్లేషించి ఈ ర్యాంకులను ప్రకటించారు.
ఎంబీఏ కోర్సుల నిర్వహణ ప్రమాణాల్లో ప్రపంచస్థాయి అగ్రశ్రేణి 100 విద్యాసంస్థల్లో భారత్కు చెందిన మూడు ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లకు, హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)కు స్థానం లభించింది. బెంగళూరు, అహ్మదాబాద్, కోల్కతా నగరాల్లోని ఐఐఎంలు ఇందులో చోటు సాధించాయి.
బిజినెస్ స్కూళ్లలో అమెరికాలోని స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వరుసగా అయిదో ఏడాది అగ్రభాగాన నిలిచింది.