ప్రఖ్యాత నేపాల్ షెర్పాగైడ్ కామీ రీటా (55) ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని 31వసారి అధిరోహించి తన రికార్డును తానే తిరగరాసుకున్నారు. 8,849 మీటర్ల ఎత్తున్న శిఖరాగ్రాన్ని 2025, మే 27న కామీ చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక సార్లు ఎవరెస్టును అధిరోహించి మరెవరూ చేరుకోలేని ఘనత సాధించారు. గత రెండేళ్లలో కామీ రీటా నాలుగు సార్లు ఎవరెస్టును అధిరోహించారు.