భారత అగ్రశ్రేణి వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను రికార్డు బద్దలు కొడుతూ కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్లో స్వర్ణం గెలుచుకుంది. 2025, ఆగస్టు 25న జరిగిన మహిళల 48కేజీ విభాగంలో 193 కిలోలు ఎత్తి విజేతగా నిలిచింది. ఇది ఛాంపియన్షిప్ రికార్డు. గత రికార్డు కంటే 14 కిలోలు ఎక్కువ. చాను స్నాచ్లో 84 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్లో 109 కిలోలు ఎత్తింది. మలేసియాకు చెందిన ఇరెన్ హెన్రీ (161కేజీ) రజతం నెగ్గగా.. వేల్స్ అమ్మాయి నికోల్ రాబర్ట్స్ (150) కాంస్యం సాధించింది.