Published on Apr 14, 2025
Admissions
కౌన్సిల్‌ ఆఫ్‌ అర్కిటెక్చర్‌లో పీజీ ప్రోగ్రామ్
కౌన్సిల్‌ ఆఫ్‌ అర్కిటెక్చర్‌లో పీజీ ప్రోగ్రామ్

దిల్లీలోని కౌన్సిల్‌ ఆఫ్‌ అర్కిటెక్చర్‌ 2025 విద్యా సంవత్సరానికి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రొగ్రామ్‌ (పీజీఈటీఏ 2025)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. పీజీ ఫుల్‌ టైం డిగ్రీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఇన్‌ అర్కిటెక్చర్‌ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్ష ఆధారంగా అర్కిటెక్చర్‌ విభాగంలో పీజీ ప్రవేశాలకు  పొందవచ్చు. 

వివరాలు:

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఇన్‌ అర్కిటెక్చర్‌  (PGETA 2025)

వ్యవధి: 2  సంవత్సరాలు.

అర్హతలు: అర్కిటెక్చర్‌ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. 

పరీక్ష సెంటర్లు: దేశవ్యాప్తంగా గల అన్ని ప్రముఖ నగరాల్లో.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీకు రూ.1750; ఈడబ్ల్యూఎస్‌కు ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.1250, ట్రాన్స్‌జెండర్‌లకు రూ.1000.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 29.04.2025.

అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడింగ్‌: 01.05.2025. 

ప్రవేశ పరీక్ష తేదీ: 04.05.2025.

ఫలితాలు: 06.05.2025.

Website:https://www.coa.gov.in/