Published on Jan 6, 2026
Current Affairs
కనకమేడల రవీంద్రకుమార్‌
కనకమేడల రవీంద్రకుమార్‌
  • సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ)గా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ 2026, జనవరి 5న బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 
  • రవీంద్రకుమార్‌ 1983లో ఆంధ్రప్రదేశ్‌ బార్‌కౌన్సిల్‌లో నమోదై న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం, ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీ విద్యుత్తు బోర్డు, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ డిస్కంల స్టాండింగ్‌ కౌన్సెల్‌గా పనిచేశారు. 
  • 2018 నుంచి 2024 వరకు తెలుగు దేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.