ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన 2024, సెప్టెంబరు 18న జరిగిన క్యాబినెట్ సమావేశంలో గిరిజన గ్రామాల అభివృద్ధికి రూ.79,156 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. పప్పులు, నూనెగింజల సాగును పెంచేందుకు రూ.35,000 కోట్లతో రూపొందించిన పీఎం-ఆశా పథకానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
* పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికకు ఆమోదముద్ర వేసింది.
* వీనస్ ఆర్బిటర్ మిషన్, గగన్యాన్, చంద్రయాన్-4 మిషన్ల విస్తరణకు కూడా క్యాబినెట్ ఆమోదించింది.
* ఐఐటీలు, ఐఐఎంల తరహాలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్) రంగంలో జాతీయ నైపుణ్య కేంద్రాన్ని ముంబయిలో ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.