2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం అంతర్గత అప్పులు రూ.200.16 లక్షల కోట్లకు, విదేశీరుణాలు రూ.8.92 లక్షల కోట్లకు చేరనున్నట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్చౌధరి 2025, ఫిబ్రవరి 10న లోక్సభలో తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ రుణ-జీడీపీ నిష్పత్తిలో ఏటా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి.
2018-19లో 49.3% మేర ఉన్న ఈ రుణ నిష్పత్తి ఆ తర్వాత తగ్గుతూ, పెరుగుతూ వస్తోంది. 2031 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వ రుణ నిష్పత్తిని జీడీపీలో 50శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2026-27 నుంచి 2030-31 వరకు ఏటా ఆర్థికలోటును తగ్గించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.