Published on Jan 2, 2025
Current Affairs
కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు
కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు

ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై), పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌) అమలును 15వ ఆర్థిక సంఘం పదవీకాలానికి అనుగుణంగా కొనసాగించేందుకు క్యాబినెట్‌ అంగీకరించింది.

2024, జనవరి 1న ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

దీనికోసం 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సర మధ్యకాలానికి కేటాయింపును రూ.69,515.71 కోట్లకు పెంచింది.

ఇదివరకు 2020-21 నుంచి 24-25 మధ్య కాలానికి రూ.66,550 కోట్లు కేటాయించింది.

ఈ పథకం అమలుచేస్తున్న రాష్ట్రాల్లో పండించే పంటలకు ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కల్పించడానికి వీలవుతుంది.