Published on Oct 17, 2024
Current Affairs
కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు
కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 2024, అక్టోబరు 16న కేంద్ర క్యాబినెట్‌ సమావేశమైంది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

వారణాశి వద్ద గంగా నదిపై నిర్మించనున్న నాలుగు వరుసల రైలు, ఆరు వరుసల రోడ్డుతో కూడిన వంతెన ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని అంచనా వ్యయం రూ.2,642 కోట్లు. 

పంటల మద్దతు ధరలు ఉత్పాదక వ్యయం కన్నా 1.5 రెట్లు అధికంగా ఉండేలా చూస్తామన్న హామీకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం గోధుమ, శనగ, మసూర్‌దాల్, ఆవాలు, బార్లీ, కుసుమ పంటల ధరలను నిర్ణయించింది. 2025, ఏప్రిల్‌ నుంచి ప్రారంభమయ్యే 2025-26 మార్కెటింగ్‌ ఏడాది కోసం ఈ ధరలను నిర్ణయించింది.