Published on Sep 20, 2024
Current Affairs
కంటార్‌ బ్రాండ్జ్‌ నివేదిక
కంటార్‌ బ్రాండ్జ్‌ నివేదిక

భారత దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్‌ వరుసగా మూడో ఏడాదీ అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. ఈ కంపెనీ బ్రాండ్‌ విలువ 16% వృద్ధితో 49.7 బి. డాలర్ల (దాదాపు రూ.4.17 లక్షల కోట్లు)కు చేరింది. కంటార్‌ బ్రాండ్జ్‌ 2024, సెప్టెంబరు 19న విడుదల చేసిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ ఉన్నాయి.

* 108 విభాగాల్లోని 1,535 బ్రాండ్లపై 1.41 లక్షల మంది స్పందనను తీసుకుని ఈ నివేదికను రూపొందించారు.