2024 మార్చి నాటికి ప్రతి కుటుంబంపై తలసరి రూ.86,713 అప్పు ఉన్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్చౌధరి 2025, ఫిబ్రవరి 10న లోక్సభలో తెలిపారు.
2019లో రూ.46,898 మేర ఉన్న రుణ భారం అయిదేళ్లలో 85%మేర పెరిగినట్లు వెల్లడించారు.
ఇదే సమయంలో కుటుంబాల పొదుపుశాతం తగ్గినట్లు చెప్పారు.
ఇది 2018-19లో జీడీపీలో 20.3%మేర ఉన్న కుటుంబాల పొదుపు నిష్పత్తి, 2019-20లో 19.1%, 2020-21లో 22.7%, 2021-22లో 20.1%కి చేరి 2022-23 నాటికి 18.4%కి తగ్గినట్లు తెలిపారు.