అంతర్జాతీయ టెక్ సంస్థ కాగ్నిజెంట్, తన గ్లోబల్ కేపబులిటీ సెంటర్(జీసీసీ) సర్వీస్ లైన్కు గ్లోబల్ హెడ్గా తెలుగువారైన శైలజా జోస్యుల నియమితులయ్యారు.
ఈమె హైదరాబాద్ కేంద్రంగా కాగ్నిజెంట్ అంతర్జాతీయ జీసీసీ కార్యకలాపాల వ్యూహాలు రూపొందిస్తారు.
కాగ్నిజెంట్లోనే 2018-24 మధ్య పలు నాయకత్వ హోదాల్లో ఈమె పనిచేశారు.
కాగ్నిజెంట్ హైదరాబాద్ సెంటర్ అధిపతిగా, బీఎఫ్ఎస్ఐ కార్యకలాపాల డెలివరీ విభాగం అధిపతిగా వ్యవహరించారు కూడా.