ఇంధన రంగంలోని ప్రభుత్వ, ప్రైవేటు దిగ్గజ సంస్థలు ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ జట్టు కట్టాయి. చమురు-గ్యాస్ అన్వేషణ, వెలికితీత కోసం ఉపయోగించే రిగ్లు, సరఫరా నౌకలు, లాజిస్టిక్స్, ప్రత్యేక సముద్రగర్భ సామగ్రి లాంటి వనరులను సంయుక్తంగా పంచుకునే ఒప్పందంపై రెండు కంపెనీలు సంతకాలు చేశాయి.
దేశ తూర్పు తీరంలోని క్షేత్రాల్లో ముఖ్యంగా కృష్ణా గోదావరి (కేజీ) క్షేత్రం, అండమాన్ క్షేత్రాల్లో డీప్వాటర్ ఆఫ్షోర్ తవ్వక, ఉత్పత్తి కార్యకలాపాల్లోని వనరులను ఈ ఒప్పందం కింద రెండు సంస్థలు ఉపయోగించుకుంటాయని ఓఎన్జీసీ పేర్కొంది.