వాణిజ్యం, పెట్టుబడి, ఇంధన భద్రత రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఒమన్ విదేశాంగమంత్రి బద్ర్ అల్బుసైదీతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ 2025, ఫిబ్రవరి 16న విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు.
హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశాల 8వ సదస్సుకు హాజరుకావడానికి ఒమన్ రాజధానికి వచ్చిన జైశంకర్.. బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులు సహా పలు దేశాల విదేశాంగమంత్రులతోనూ భేటీ అయ్యారు.
ఒమన్-భారత్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లైన సందర్భంగా ఇరువురు నేతలు ప్రత్యేక లోగోను విడుదల చేశారు.