టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నాడు.
ఏడుగురితో కొత్తగా ప్రకటించిన జాబితాలో ధోనితో పాటు మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా), హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా) కూడా ఉన్నారు.
2020లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. మూడు ఫార్మాట్లలో కలిపి 17,266 పరుగులు సాధించాడు.
అతడి సారథ్యంలో భారత్ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.