ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మూడోసారి విజేతగా నిలిచింది.
2025, మార్చి 9న దుబాయ్లో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై గెలిచింది.
టీమ్ఇండియా 12 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని చేజిక్కించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ శర్మ 76 పరుగులతో టాప్స్కోరర్గా నిలిచాడు.
అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
భారత్కిది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ. అత్యధికసార్లు ఈ ట్రోఫీని గెలిచిన జట్టు భారతే. ఆస్ట్రేలియా (2006, 2009) రెండో స్థానంలో ఉంది.
2002లో శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచిన టీమ్ఇండియా, 2013లో ఇంగ్లాండ్ను ఓడించి టైటిల్ సాధించింది.