ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ల (గ్రేడ్ 'O') ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి. ఎంపికైనవారు ఏడాది వ్యవధితో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు పూర్తిచేయాలి. మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, బెంగళూరులో పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు పూర్తిచేయాలి.
మొత్తం పోస్టులు: 650 (యూఆర్: 260, ఎస్సీ: 100, ఎస్టీ: 54, ఈడబ్ల్యూఎస్: 65, ఓబీసీ: 171, పీడబ్ల్యూడీ: 26)
వివరాలు:
అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. కంప్యూటర్ ప్రావీణ్యం, ప్రాంతీయ భాష పరిజ్ఞానం ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: మార్చి 1, 2025 నాటికి 20 - 25 సంవత్సరాలు ఉండాలి.
జీతం, స్టైపెండ్: శిక్షణ సమయంలో నెలకు రూ.5,000; ఇంటర్న్షిప్ సమయంలో నెలకు రూ.15,000. ఉద్యోగంలో చేరిన తర్వాత ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ6.50 అందుతుంది.
దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.250; ఇతరులు రూ.1,050.
పరీక్షా కేంద్రాలు: ముంబయి, దిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లఖ్నవూ, పట్న తదితర నగరాల్లో.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 01.03.2025.
దరఖాస్తు & ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 12.03 2025.
ఆన్లైన్ పరీక్ష తేదీ: 06.04.2025.
Website:https://www.idbibank.in/