ప్రపంచంలోని అత్యంత కాలుష్య దేశంగా 2025లో పాకిస్థాన్ నిలిచింది. వాయు నాణ్యతను పర్యవేక్షించే స్విట్జర్లాండ్ సంస్థ ఐక్యూఎయిర్ 2025, మార్చి 24న ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. మొత్తం 143 దేశాలు, 9,446 నగరాల్లో వాయు నాణ్యతా పరీక్షలు నిర్వహించింది. నివేదిక ప్రకారం..
పాకిస్థాన్ తర్వాత అత్యంత కలుషితమైన దేశాల జాబితాలో బంగ్లాదేశ్, తజికిస్థాన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో భారత్ ఆరో స్థానంలో ఉంది.