Published on Aug 29, 2024
Current Affairs
ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌కు తాత్కాలిక ఛైర్మన్‌లు
ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌కు తాత్కాలిక ఛైర్మన్‌లు

దేశీయ దిగ్గజ చమురు విక్రయ సంస్థలు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), హిందుస్థాన్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌)కు తాత్కాలిక ఛైర్మన్‌లను ప్రభుత్వం 2024, ఆగస్టు 28న నియమించింది. వీటికి పూర్తి స్థాయి ఛైర్మన్‌లను నియమించే ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. 

* ఐఓసీకి తాత్కాలిక ఛైర్మన్‌గా సతీశ్‌ కుమార్‌ వడుగూరి బాధ్యతలు చేపట్టనున్నారు. సెప్టెంబరు 1 నుంచి మూడు నెలల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. 

* హెచ్‌పీసీఎల్‌కు కూడా సెప్టెంబరు 1 నుంచి మూడు నెలల పాటు ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టరుగా బాధ్యతలు నిర్వహించేందుకు రజ్‌నీశ్‌ నారంగ్‌ను ప్రభుత్వం నియమించింది.