Published on Nov 14, 2024
Current Affairs
ఐఓసీ ఛైర్మన్‌గా అర్విందర్‌ సింగ్‌ సాహ్నీ
ఐఓసీ ఛైర్మన్‌గా అర్విందర్‌ సింగ్‌ సాహ్నీ

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) కొత్త ఛైర్మన్‌గా అర్విందర్‌ సింగ్‌ సాహ్నీ 2024, నవంబరు 13న నియమితులయ్యారు.

ప్రస్తుతం ఆయన ఐఓసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (బిజినెస్‌ డెవలప్‌మెంట్‌- పెట్రోకెమికల్స్‌)గా ఉన్నారు. ఆయన అయిదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.