Published on Feb 12, 2025
Current Affairs
ఐఐటీ- హైదరాబాద్‌తో ఈఈఎస్‌ఎల్‌ భాగస్వామ్యం
ఐఐటీ- హైదరాబాద్‌తో ఈఈఎస్‌ఎల్‌ భాగస్వామ్యం

కేంద్ర ఇంధన శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు ఉమ్మడిగా నెలకొల్పిన ఈఈఎస్‌ఎల్‌ (ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌) తన 15వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో రూ.500 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది.

వినూత్న ఇంధన పరిష్కారాలు కనుగొనడం, పరస్పర సహకారంతో వృద్ధి బాటలో నడవటం ఈ ఒప్పందాల లక్ష్యం.

ఇండొనేషియా- మలేషియా- ధాయ్‌ల్యాండ్‌ గ్రోత్‌ ట్రయాంగిల్, జాయింట్‌ బిజినెస్‌ కౌన్సిల్, గ్రీన్‌ గ్రోత్‌ ఏషియా ఫౌండేషన్, ఐఐటీ- హైదరాబాద్‌ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఇందులో ఉన్నాయి.