Published on Jun 5, 2025
Current Affairs
ఐఐఏఎస్‌ అధ్యక్ష పదవి
ఐఐఏఎస్‌ అధ్యక్ష పదవి

బెల్జియంలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సైన్సెస్‌ (ఐఐఏఎస్‌) అధ్యక్ష పదవిని తొలిసారి భారత్‌ గెలుచుకుంది.

శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించే ఐఐఏఎస్‌లో 31 దేశాలకు సభ్యత్వం ఉంది.

1998 నుంచి ఇందులో భారత్‌కు సభ్యత్వం ఉంది.

అధ్యక్ష పదవి (2025-28)కి భారత్, ఆస్ట్రియా పోటీ పడ్డాయి.

బ్యాలెట్‌ ద్వారా జరిగిన ఎన్నికలో 141 ఓట్లు పోలయ్యాయి.

భారత్‌కు 87 ఓట్లు, ఆస్ట్రియాకు 54 ఓట్లు లభించాయి.

భారత్‌ తరఫున డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ రీఫార్మ్స్‌ అండ్‌ పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ కార్యదర్శి వి.శ్రీనివాస్‌ను అధ్యక్షపదవికి ప్రధానమంత్రి మోదీ సిఫార్సు చేశారు.