చంద్రుడిపై పరిశోధనల్లో గణనీయ పురోగతి సాధించిన చంద్రయాన్-3 మిషన్కు నేతృత్వం వహించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధిపతి, డీవోఎస్ సెక్రటరీ డాక్టర్ సోమనాథ్కు ప్రతిష్ఠాత్మక ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ పురస్కారం దక్కింది. ఇటలీలోని మిలాన్లో 2024, అక్టోబరు 14న జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో ఐఏఎఫ్ ప్రతినిధుల చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు.